VSP: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో శనివారం మహాత్మా జ్యోతీరావు పూలే జయంతి సందర్భంగా అదనపు కమిషనర్ పిఎమ్.సత్యవేణి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పూలే అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడని, మహిళా విద్య, అంటరానితనం నిర్మూలనకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.