ASR: జిల్లాలోని ఎంఎల్ఎస్ పాయింట్లు, మధ్యాహ్న భోజన కేంద్రాలు, ప్రభుత్వ వసతి గృహాలకు అంతరాయం లేకుండా డిపోల నుంచి సరుకులను చేరవేయాలని జాయింట్ కలెక్టర్ శ్రీపూజ అధికారులను ఆదేశించారు. అందులో ఉత్పన్నమయ్యే సమస్యలను అధిగమించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలన్నారు. సరుకుల సరఫరాకు జియో ట్రాకింగ్ తో కూడిన వాహనాలను, డ్రైవర్లను అందుబాటులో ఉంచాలన్నారు.