GNTR: ఆయేషా మీరా అస్థికలను సీబీఐ తల్లిదండ్రులకు అప్పగించనుంది. రేపు తెనాలిలో భారీ బందోబస్తు మధ్య అంత్యక్రియలు జరగనున్నాయి. కేసులో దర్యాప్తు విఫలమైందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు న్యాయం చేస్తారని ఆశాభావం తెలిపారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేసి డిసెంబర్ 27ను సంస్మరణ దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.