అన్నమయ్య: గాలివీడు మండలంలో జరిగిన హత్య కేసును పోలీసులు గురువారం ఛేదించారు. భూ తగాదాలు, అన్నదమ్ముల మధ్య వర్గ పోరు కారణంగానే ఈ హత్య జరిగినట్లు SP ధీరజ్ కునిబిల్లి వెల్లడించారు. ప్రధాన నిందితుడు మహేశ్వర్ రెడ్డి నుంచి రూ. 4 లక్షల నగదు, హత్యకు వాడిన 2 కత్తులు, 7 సెల్ ఫోన్లు, కారు, బైకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండుకు పంపారు.