ASR: పెదబయలు మండలం చేదుపుట్టు, పులిగొంది గ్రామాల్లో పీఎం జన్మన్ పథకం కింద గృహప్రవేశాలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న RTC విజయనగరం జోన్ ఛైర్మన్ దొన్ను దొర మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా రెండో విడతలో 19,963 ఇళ్లను అందజేసినట్టు తెలిపారు. అలాగే గ్రామానికి రోడ్డు నిర్మాణం అనంతరం బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు.