కోనసీమ: 2047వ సంవత్సరానికి మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్ళు పూర్తవుతున్న సమయానికి పేదరికం లేని సమాజం నిర్మించడమే ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పీ4 కార్యక్రమాన్ని చేపట్టినట్లు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. ఇవాళ కొత్తపేట కాపు కళ్యాణ మండపంలో జరిగిన పీ4 ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.