సత్యసాయి: పుట్టపర్తిలోని సాయి ఆరామంలో ఇవాళ ‘పి4’ (P4) కార్యక్రమం ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పాల్గొన్నారు. సమాజ సేవలో విశేష కృషి చేసిన మార్గదర్శకులకు, అండగా నిలిచిన ‘బంగారు కుటుంబాలకు’ ఈ సందర్భంగా ప్రశంసా పత్రాలు అందజేసి గౌరవించారు.