KDP: జిల్లాలో ముగ్గురు అధికారుల బదిలీలు జరిగాయి. కడప మున్సిపల్ కమిషనర్ నిమనపల్లి మనోజ్ రెడ్డి, జమ్మలమడుగు ఆర్డీవో సాయిశ్రీ, కడప ఆర్డీవో జాన్ ఇర్విన్ బదిలీ అయ్యారు. తదుపరి పోస్టింగ్ కోసం జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీకి రిపోర్ట్ చేయాలని సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పరిపాలనలో భాగంగా ఈ బదిలీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.