గుంటూరు: పట్టణంలో బుధవారం పశుసంవర్ధక శాఖ జేడీ కె.వి.వి.సత్యనారాయణ పలు పాల కేంద్రాలను తనిఖీ చేశారు. ట్రేడ్ లైసెన్స్ లేకుండా పాలు విక్రయించరాదని ఆయన స్పష్టం చేశారు. పలు కేంద్రాల్లో పాల నమూనాలను సేకరించి, పరీక్షల కోసం ఫుడ్ సేఫ్టీ అధికారులకు పంపినట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి పాల విక్రయాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాపారులను హెచ్చరించారు.