AKP: ఎస్ రాయవరం మండలంలో 28 గ్రామపంచాయతీలో 62,032 మంది ఓటర్లు ఉన్నట్లు డిప్యూటీ ఎంపీడీవో బంగారు సత్యనారాయణ తెలిపారు. వీరిలో పురుషులు 29,944 మంది, మహిళలు 32,086 మంది, ఇతరులు ఇద్దరు ఉన్నట్లు తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీ వద్ద ఓటరు జాబితాలను ప్రజలకు అందుబాటులో ఉంచామన్నారు. ఓటర్లు ఓ సారి ఓటరు జాబితాలను పరిశీలించి అభ్యంతరాలు ఉంటే తెలియచేయాలన్నారు.