ప్రకాశం: ఒంగోలులో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కార్పొరేట్ శాలరీ ప్యాకేజీ కింద రూ.1.20 కోట్ల ఇన్సూరెన్స్ క్లెయిమ్ను అత్యంత వేగంగా పరిష్కరించింది. ప్రమాదంలో మరణించిన ఏపీ సచివాలయ ఉద్యోగి పొదిలి భార్గవనాథ్ కుటుంబానికి జిల్లా కలెక్టర్ రాజాబాబు శనివారం ఈ చెక్కును అందజేశారు. ప్రభుత్వ ఉద్యోగులందరూ ఇలాంటి ఇన్సూరెన్స్ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.