ప్రకాశం: దర్శి మండలం పోతవరంలో జిల్లా కలెక్టర్ రాజాబాబు శుక్రవారం రాత్రి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నిద్రించారు. పల్లె నిద్రలో భాగంగా గ్రామంలో సాయంత్రం నుంచి గ్రామస్తుల సమస్యలను విన్నారు. కలెక్టర్గా కాకుండా వారిలో ఒకరుగా కలిసిపోయి గ్రామ సమస్యలతో పాటు గ్రామస్తుల వ్యక్తిగత సమస్యలను విన్నారు. న్యాయపరమైన సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.