VZM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శనివారం టీడీపీ పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున 33 శాతం సీట్లను మహిళలకు కేటాయిస్తామని ఆ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రకటించడం హర్షనీయమన్నారు. రాజకీయాల్లో మహిళలకు పెద్దపీట వేయాలనే ఆయన నిర్ణయం చారిత్రాత్మకమైనదన్నారు.