మన్యం: గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీ ప్రాంతంలో ఉదయం వేళల్లో దట్టమైన మంచు కమ్ముకోవడంతో పలు గిరిజన గ్రామాలు మంచు దుప్పటిలో మూసుకుపోయాయి. రహదారులపై కనీస దృశ్యమానత లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు మామిడి పూత, జీడి పంటలకు నష్టం కలుగుతుందేమోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.