KDP: కమలాపురం నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమానికి మరొక అడుగు పడనుంది. నేడు MLA పుత్తా చైతన్య రెడ్డి, TDP రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డిల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం ఫైర్ ఇంజన్ వాహనం ప్రారంభంతో కార్యక్రమాలు ప్రారంభమై, TDP ఆఫీసు వద్ద ప్రజా దర్బార్ ద్వారా ప్రజల నుంచి అర్జీలు స్వీకరణ జరుగుతుందని పార్టీ కార్యవర్గ సభ్యులు తెలిపారు.