NDL: కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి ఇందిరా ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం బనగానపల్లెలో అంతే క్యాంపు కార్యాలయంలో మీడియాతో ఆమె మాట్లాడారు. రవీంద్రనాథ్ రెడ్డి తనపై, ఆరోపణలు చేయడం తగదన్నారు. ఆరోపణలు నిరూపించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.