SKLM: ఆమదాలవలస మండలం వంజంగి గ్రామ గెడ్డగట్టు పైన పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను ఆదివారం సాయంత్రం ఎస్సై ఎస్. కాంతారావు తన సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. వారి వద్ద నుండి రూ.10,020 లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పేకాట ఆడితే చట్టపరమైన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.