ATP: CM చంద్రబాబు నాయుడు సోమవారం యాడికి పర్యటించనున్న నేపథ్యంలో వాహనాల రాకపోకలు మళ్లిస్తున్నట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. వేములపాడు క్రాస్ నుంచి యాడికి మార్గంలో వాహనాలకు అనుమతి నిలిపివేశారు. గుత్తి నుంచి రాయలచెరువు మీదుగా వెళ్లే సిమెంట్ లారీలు జాతీయ రహదారి-67 ద్వారా తాడిపత్రి వైపు వెళ్లాలని సూచించారు.