BPT: వేమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు శనివారం స్థానిక ప్రభుత్వ వైద్యశాలను ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడి, వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని సిబ్బందిని హెచ్చరించారు.