కోనసీమ: ఈనెల 28న మలికిపురం ఎంవీఎన్ జెఎస్ అండ్ ఆర్ వీఆర్ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు వికాస్ జిల్లా అధికారి డి.హరిశేషు తెలిపారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఉపాధి కార్యాలయం, వికాస్ ఆధ్వర్యంలో జరిగే ఈ జాబ్ మేళాలో పది కంపెనీలు పా ల్గొంటున్నాయని 410 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ అవకాశాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.