ప్రకాశం: ఒంగోలు DSP శ్రీనివాసరావు తన పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. ప్రతి పోలీస్ స్టేషన్ వారీగా నమోదైన కేసులు, దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల స్థితిగతులను క్షుణ్ణంగా సమీక్షించారు. దొంగతనాలు, మహిళలపై జరుగుతున్న నేరాలు, ఎస్సీ, ఎస్టీ కేసుల్లో విచారణను వేగవంతంచేసి, బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలన్నారు.