KKD: ఏఐటీయూసీ కాకినాడ జిల్లా నూతన కౌన్సిల్ 13 మందితో ఎన్నికైనట్లు ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ తెలిపారు. ఆదివారం కాకినాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నూతన నాయకత్వాన్ని ఆయన పరిచయం చేశారు. గౌరవ అధ్యక్షులుగా తాటిపాక మధు, అధ్యక్షులుగా కసింకోట కిషోర్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్గా బొబ్బిలి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా తోకల ప్రసాద్ ఎన్నికయ్యారు.