ప్రకాశం: ఏపీకే ఫైల్స్ లింకుల జోలికి పోవద్దని కొండపి సీఐ సోమశేఖర్ ప్రజలను హెచ్చరించారు. సోమవారం సర్కిల్ కార్యాలయంలో పాత్రికేయలతో మాట్లాడుతూ.. ఇటీవల సైబర్ నెరగాళ్లు అమాయకుల బ్యాంకు ఖాతాలో నుంచి వివిధ రూపాలలో నగదు కాజేచేస్తున్నారని హెచ్చరించారు. సోషల్ మీడియాలో వచ్చే లింకులు ఏవి ఓపెన్ చేసేందుకు ప్రయత్నించవద్దని తెలిపారు.