కృష్ణా: గన్నవరంలో జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంపై ఆదివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎంపీ వల్లభనేని బాలశౌరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత వేగవంతంగా సమర్థవంతంగా చేపట్టాలని నేతలకు సూచించారు. గ్రామ వార్డు స్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.