CTR: ఐరాల మండలం తిరుమలయ్య గారి పల్లెలో శనివారం ఎమ్మెల్యే మురళీమోహన్ ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంక్షేమానికి, అభివృద్ధికి సమ ప్రాధాన్యమిస్తూ కూటమి ప్రభుత్వం పాలన కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెలా లబ్ధిదారులకు పెంచిన మొత్తంతో పింఛన్లు అందిస్తున్నామన్నారు.