సత్యసాయి: కొత్తచెరువు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదురుగా ఉన్న కిరాణా దుకాణాన్ని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గంజాయి, గుట్కా, ఖైనీ వంటి నిషేధిత ఉత్పత్తులను విక్రయించడం చట్టవిరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వీటిని నిషేధించిందని గుర్తుచేశారు.