SS: శ్రీ సత్యసాయి జిల్లాలో మున్సిపల్ అభివృద్ధి పనులు, పారిశుధ్యం, పౌర సేవలపై కలెక్టరేట్లో కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ శనివారం సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో రూ. 760.59 కోట్లతో నీటి సరఫరా, మురుగునీటి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. అమృత్ (AMRUT) 1.0 & 2.0 పనులను గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.