AP: శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా భక్తులకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సఖ్యత, సంతోషాలు, అష్టైశ్వర్యాలు కలగాలని ఆకాంక్షించారు. అందరికీ ఆ దేవి దీవెనలు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు జగన్ పేర్కొన్నారు.