అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నూతన వీసీగా జ్యోతికుమార్ నేడు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. 20 నెలల ఇన్ఛార్జ్ పాలన తర్వాత వస్తున్న రెగ్యులర్ వీసీకి ఎన్నో సవాళ్లు ఎదురుకానున్నాయి. అధ్వానంగా ఉన్న వసతిగృహాలు, ఉద్యోగుల గైర్హాజరు, దూరవిద్య కేంద్రం నిర్వీర్యం, సర్టిఫికెట్ల జారీలో జాప్యం వంటి సమస్యలపై కొత్త వీసీ దృష్టి సారించాల్సి ఉంది.