BPT: సంతమాగులూరు మండలంలో వచ్చే మూడు రోజుల పాటు తీవ్రమైన వేడి పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అధిక ఉష్ణోగ్రతలు, తేమ ప్రభావంతో వాతావరణం సుమారు 41 డిగ్రీల వరకు చేరే పరిస్థితి ఉండొచ్చని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.