VZM: అభివృద్ధికి శాస్త్రీయ విజ్ఞానమే మూలం అని జనవిజ్ఞాన వేదిక జాతీయ అధ్యక్షుడు డా. ఎంవిఆర్ కృష్ణాజీ అన్నారు. చీపురుపల్లి, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం జన విజ్ఞాన వేదిక సైన్స్ దినోత్సవ వేడుకలలో ఆయన పాల్గొన్నారు. ఆవిష్కరణలు, శాస్త్ర విజ్ఞానం ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతిరావు, శివాజీ పాల్గొన్నారు.