E.G: ప్రజా సమస్యల పరిష్కారానికి వేదిక ‘ప్రజా దర్బార్’ అని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. గురువారం రాజమండ్రిలోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఎమ్మెల్యే ఫిర్యాదుల స్వీకరించారు. సమస్యను సంబంధిత అధికారికి బదిలీ చేసి నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని సూచించారు.