CTR: గుడిపాల పోలీసులు అక్రమంగా తరలిస్తున్న 3.5 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.2 లక్షల విలువ గల బియ్యంతో పాటు రూ.3 లక్షల విలువైన బొలెరో వాహనాన్ని కూడా పట్టుకున్నారు. ఒక నిందితుడిని అరెస్ట్ చేయగా, మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగుతోంది.