ATP: ఈ నెల 25న జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు సంబంధిత అధికారులు మంగళవారం తెలిపారు. వారు మాట్లాడుతూ.. శనివారం ఉదయం 10:30 గంటలకు సమావేశం నిర్వహిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు సమావేశానికి సంబంధించిన అజెండాను తయారు చేశారు. జిల్లా అధికారులు సమర్పించిన ప్రగతి నివేదికపై చర్చ, తదితర అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటారన్నారు.