TPT: ఏర్పేడు-శ్రీకాళహస్తి మధ్య రైలు పట్టాలు దాటుతుండగా జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. వెంకటగిరి(M) కాంపాలెం గ్రామానికి చెందిన శ్రీను రైల్వే గేటు సమీపంలో పట్టాలు దాటే క్రమంలో బైకు అదుపుతప్పి కిందపడటంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.