KRNL: నేర నియంత్రణే లక్ష్యంగా గట్టిగా పని చేయాలని, IPL ఫైనల్ క్రికెట్ మ్యాచ్ల నేపథ్యంలో బెట్టింగ్ కార్యకలపాలపై గట్టి నిఘా ఉంచాలని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ పోలీసు అధికారులకు ఆదేశించారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.