W.G: తాడేపల్లిగూడెం 31, 32వ వార్డులకు చెందిన 40 మంది సోమవారం సాయంత్రం వైసీపీ నాయకుడు శీలి వెంకటేశ్వరరావు, శీలి మేరీ కుమారి ఆధ్వర్యంలో జనసేనలో చేరారు. వారికి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. దళితుల అభ్యున్నతే జనసేన లక్ష్యమని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలని వారికి సూచించారు.