కడప నగరంలో ఆప్కి ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శి షేక్ మక్బూల్ బాషా పేద ముస్లింలకు రంజాన్ తోఫా కిట్లు పంపిణీ చేశారు. ఒక దాత సహాయంతో 10 కిలోల బియ్యం, గోధుమ పిండి, నూనె, రవ్వ, చక్కర, మసాలా పదార్థాలు, సేమియాలు, బాదం, కాజు, నెయ్యి తదితరాలతో కూడిన కిట్లు 25 మందికి అందజేశారు. రంజాన్ మాసంలో పేదలకు ప్రభుత్వమే రంజాన్ తోఫా అందించాలని మక్బూల్ కోరారు.