NDL: మహానంది మండలం బుక్కాపురంలో YCP శిలా ఫలకాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. గ్రామంలో రైస్ మిల్లు నుంచి శ్మశానం వరకు సుమారు రూ. 7 లక్షలతో వైసీపీ ప్రభుత్వంలో రహదారిని నిర్మించారు. ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని గురువారం రాత్రి దుండగులు ధ్వంసం చేసినట్లు ఆ పార్టీ గ్రామ నాయకుడు కందుల రఘురామిరెడ్డి తెలిపారు. పూర్తి వివరాలుత తెలియాల్సి ఉంది.