ASR: గొలుగొండ మండలంలో మంగళ, బుధవారాల్లో కురిసిన ఆకస్మిక ఈదురుగాలులతో కూడిన వర్షాలు మామిడి రైతులకు తీవ్ర నష్టం కలిగించాయి. పలు గ్రామాల్లో తోటల్లో కాయలు నేల రాలిపోయాయి. ఎంతో శ్రమించి పెంచిన పంట ఇలా దెబ్బతినడంతో రైతులు నిరాశకు గురవుతున్నారు. అధికారులు నష్టాన్ని అంచనా వేసి సహాయం అందించాలని వారు కోరుతున్నారు.