కృష్ణా: మార్చి నెల పెన్షన్లను ఈనెల 28వ తేదీన పంపిణీ చేయనున్నట్లు మొవ్వ MPDO డి. సుహాసిని తెలిపారు. ఒకటవ తేదీ ఆదివారం కావడంతో ఈ నెల 28వ తేదీన ముందుగానే అందజేయనున్నట్లు ఆమె చెప్పారు. NTR భరోసా పింఛన్ పథకం కింద మండలంలో 8,315 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 3,59,83,500 నిధులు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.