KRNL: ఆదోనిలో ఆవోపా, వామ్, వాసవి క్లబ్, ఐఐఎఫ్, ఐవీఎఫ్ సంయుక్త ఆధ్వర్యంలో ఇవాళ 22వ విడత “స్వర్ణామృత ప్రాసనం” మందుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. త్రిదండి చిన్న జీయర్ స్వామి ఆశీస్సులతో 219 మంది చిన్నారులకు రోగనిరోధక మందులు అందజేశారు. ఈ సందర్భంగా వంకదారు శ్రీనాథ్ గుప్తా మాట్లాడుతూ.. ఈ మందు పిల్లల ఆరోగ్యం, మేధాశక్తి పెంపుకు దోహదపడుతుందని తెలిపారు.