GNTR: కాకుమాను మండలం కొండపాటూరు శ్రీ పోలేరమ్మ తిరునాళ్ల ఏర్పాట్లపై మంగళవారం అధికారులు సమీక్షించారు. మార్చి 31న మల్లెపూల పూజ, ఏప్రిల్ 3న కుంకుమ పూజ, 7న తిరునాళ్లు జరగనున్నాయి. సమావేశంలో గ్రామస్తులు రోడ్లు, విద్యుత్, ట్రాఫిక్ సమస్యలను ప్రస్తావించారు. ఉన్నతాధికారులతో చర్చించి వెంటనే వీటిని పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.