కోనసీమ: అమలాపురం హైస్కూల్ సెంటర్ వద్ద వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో శెట్టిబలిజ పితామహులు దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ చింత అనురాధ, ముమ్మిడివరం నియోజకవర్గ వైసీపీ పరిశీలకులు చెల్లుబోయిన శ్రీనివాసరావు పాల్గొని వెంకటరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.