కోనసీమ: ముమ్మిడివరంలో ఇళ్లు కోల్పోయిన అగ్నిప్రమాద బాధితులను MLA దాట్ల సుబ్బరాజు శనివారం పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బాధిత కుటుంబాలకు తక్షణ సాయంగా రూ.5,000 నగదుతో పాటు నిత్యావసరాలు అందజేశారు. బాధితులకు త్వరగా పునరావాసం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.