NLR: వెంకటాచలంలో టీడీపీ మండల కార్యాలయాన్ని గురువారం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు. ముందుగా మండల టీడీపీ శ్రేణులు ఎమ్మెల్యేకి ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే సోమిరెడ్డి మాట్లాడారు. త్వరలోనే వెంకటాచలంలో శాశ్వత భవనం నిర్మిస్తామన్నారు. టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు.