ఏలూరు జిల్లాలో గృహ వినియోగదారులకు సరిపడా గ్యాస్ సిలిండర్ల నిల్వలు ఉన్నాయని, ఎటువంటి కొరత లేదని జేసీ అభిషేక్ గౌడ్ తెలిపారు. కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెటింగ్కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించి అధిక ధరలకు విక్రయిస్తే సహించేది లేదని, అక్రమ నిల్వలపై ప్రత్యేక నిఘా ఉంచామని ఆయన స్పష్టం చేశారు.