CTR: చౌడేపల్లి మండలంలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ బుధవారం పర్యటించారు. జలధార కార్యక్రమంలో భాగంగా దిగువ పల్లె, కాగతి, ఏ కొత్తకోట పంచాయతీ పరిధిలో చెరువులు, సప్లై ఛానల్కి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే, చెరువుల వేలాల నిర్వహణపై ఆరా తీశారు.పనుల పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.