AKP: రాజకీయాలకతీతంగా అభివృద్ధిపైనే ప్రత్యేక అధికారులు దృష్టి సారించాలని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సూచించారు. ఈ మేరకు సబ్బవరంలో ప్రత్యేక అధికారులు, నాయకులు, ప్రజలతో సమన్వయ కమిటీ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వేసవి నేపథ్యంలో తాగు, సాగునీటికి ఇబ్బందులు రాకుండా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలన్నారు.