పల్నాడు: ప్రపంచ టీబీ (క్షయ) దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ప్రత్యేక పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. క్షయ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. టీబీ నివారణకు ప్రజల్లో అవగాహన కల్పించడం, ముందస్తు పరీక్షలు, సమయానికి చికిత్స తీసుకోవడం ఎంతో అవసరమని సూచించారు.